Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

ఈస్టర్ సండే ఫేక్

యేసు నిజంగానే చనిపోయి లేచాడా? ఆ విషయాలని అప్పటి కాలం రచయితలు కళ్లారా చూసి ఆ విషయాలని బైబిల్లో రాశారా ?

ఈ విషయాలని తెలుసుకోవాలంటే మొదట బైబిల్ తెరవండి.

ఎన్నో విస్తుపోయే నిజాలు మిమ్మల్ని వెక్కిరిస్తాయి.

ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా రాయబడిన యేసు పునరుద్ధాన కట్టు కథలు మీ మనసుని గందరగోళంలో పడేస్తాయి.

ఇవన్నీ చదివిన తరవాత యేసు నిజంగానే చచ్చి లేచాడా? అనే అనుమానం రాకమానదు.

ఈస్టర్ గందరగోళంలో ఒక్కో రచయిత ఎలా చెప్పుకొచ్చాడో చూడండి

  1. మహిళలు ఏ సమయంలో సమాధిని సందర్శించారు? మత్తయి 28:1 ఆదివారమున, తెల్లవారుచుండగా

విశ్రాంతిదినము గడచిపోయిన తరువాత ఆదివారమున, తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి.

మార్కు: సూర్యోదయం అయినప్పుడు

వారు ఆదివారమున పెందలకడ (లేచి, బయలుదేరి) సూర్యోదయమైనప్పుడు సమాధియొద్దకు వచ్చుచుండగా..(మార్కు 16:2)

లూకా 24:1: ఆదివారమున తెల్లవారుచుండగా

ఆదివారమున తెల్లవారుచుండగా (ఆ స్త్రీలు) తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసికొని సమాధి యొద్దకు వచ్చి

యోహాను 20:1: ఇంకా చీకటిగా ఉన్నప్పుడు

ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధియొద్దకు వచ్చి, సమాధి మీద ఉండిన రాయి తీయబడియుండుట చూచెను.

  1. యేసు సమాధిని చూడటానికి వచ్చిన స్త్రీలు ఎవరు?

మత్తయి 28:1: మగ్దలేనే మరియయు వేరొక మరియయు

మార్కు 16:1: మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు సలోమేయు వచ్చి

లూకా 24:10 : మగ్దలేనే మరియయు యోహన్నయు యాకోబు తల్లియైన మరియయు వారితో కూడ ఉన్న యితర స్త్రీలును.

యోహాను 20:1 : మగ్దలేనే మరియ

  1. వాళ్ళు సమాధి దగ్గరకి వచ్చేసరికి సమాధి ఎలా ఉంది ?

మత్తయి 28:2: దూత పరలోకమునుండి దిగివచ్చి, రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను

మార్కు 16:4 రాయి పొర్లింపబడి యుండుట చూచిరి

లూకా 24:2 : దొరలింప బడియుండుట చూచి

యోహాను 20:1: సమాధి మీద ఉండిన రాయి తీయబడియుండుట చూచెను.

  1. వారు వచ్చినప్పుడు సమాధి వద్ద ఎవరు ఉన్నారు?

మత్తయి 28:2-7 : ఒక దూత

మార్కు 16:5: తెల్లని నిలువుటంగీ ధరించు కొనియున్న యొక పడుచువాడు

లూకా 24:4 ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన యిద్దరు మనుష్యులు

యోహాను 20:12 యిద్దరు దేవదూతలు

  1. ఈ దూతలు ఎక్కడ ఉన్నారు?

మత్తయి 28:2: రాయి మీద

మార్కు 16:5 : రాయి కుడివైపున

లూకా 24:4 : వారియొద్ద నిలువబడిరి

యోహాను 20:12 : తలవైపున ఒకడును కాళ్లవైపున ఒకడును కూర్చుండుట కనబడెను.

  1. దూత(లు) ఏమి చెప్పారు?

మత్తయి 28:5-7

దూత ఆ స్త్రీలను చూచిమీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును. ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు; రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి, త్వరగా వెళ్లి, ఆయన మృతులలోనుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి; ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్లు చున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు; ఇదిగో మీతో చెప్పితిననెను.

మార్కు 16:6-7

అందుకతడు కలవరపడకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు; ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు; వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్లి ఆయన మీకంటె ముందుగా గలిలయలోనికి వెళ్లుచున్నా డనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోను పేతురు తోను చెప్పుడనెను.

లూకా 24:5
వారు భయపడి ముఖములను నేల మోపి యుండగా వీరుసజీవుడైన వానిని మీ రెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడలేడు, ఆయన లేచియున్నాడు; ఆయన ఇంక గలిలయలో ఉండి నప్పుడు…

యోహాను 20:13:
వారు అమ్మా, యెందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమెనా ప్రభువును ఎవరో యెత్తికొని పోయిరి; ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను.

  1. ఏం జరిగిందో మహిళలు చెప్పారా?

మత్తయి 28:8 : అవును

మార్కు 16:8 : చెప్పలేదు
(వారు బయటకు వచ్చి, విస్మయము నొంది వణకుచు సమాధియొద్దనుండి పారిపోయిరి; వారు భయపడినందున ఎవనితో ఏమియు చెప్ప లేదు)

లూకా 4:9, 22-24: అవును
(సమాధి యొద్దనుండి తిరిగి వెళ్లి యీ సంగతులన్నియు పదునొకండుగురు శిష్యులకును తక్కినవారికందరికిని తెలియజేసిరి.)

యోహాను 20: 18: అవును
మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను.

గమనిక : పై విషయాలు అన్ని గమనిస్తే ఏ ఒక్క రచయితకి ఏసు ఎప్పుడు సమాధి నుండి లేచాడు? అక్కడ ఏం జరిగింది? అక్కడ ఎవరున్నారు?

అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అన్న విషయాలపై క్లారిటీ లేదు.

వీళ్ళు రాసిన కథల పుస్తకాలని నమ్మి మీ జీవితాలని పణంగా పెడుతున్నారేమో ఆలోచించండి.

ఎందుకంటే నిజం అనేది ఎపుడూ ఒకటే ఉంటుంది. ఇన్ని రకాలుగా ఉండదు .

ఇదే టాపిక్ పై పార్ట్-2 తో మళ్ళీ కలుద్దాం .

మీ రమణ నేషనలిస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *