Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

రక్త సువార్త– 5


పాపము చేసే మనుషులు అంటే దేవుడికి అస్సలు నచ్చరు. అందుకే వాళ్ళందరినీ నీటిలో ముంచి చంపేశాడు. ఇలా మనుషులను నీటిలో ముంచి చంపేయడం ఆయనకు అలవాటే. ఎందుకు అంటే పాపాత్ములు అంటే ఆయనకు అసహ్యం.

డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు పాపము చేయువారందరు నీకసహ్యులు (కీర్తనల గ్రంథము 5:5)
అయితే ఈ జలప్రళయం ద్వారా దేవుడు సాధించింది ఏమిటి?

జలప్రళయం ముందు దేవుడు ఇలా అనుకున్నాడు:

అప్పుడు యెహోవా నేను సృజించిన నరులును నరులతోకూడ జంతువులును పురుగులును ఆకాశ పక్ష్యాదులును భూమిమీద నుండకుండ తుడిచివేయుదును; ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నాననెను (ఆదికాండము 6:7)

ఇదిగో నేనే జీవ వాయువుగల సమస్త శరీరులను ఆకాశముక్రింద నుండకుండ నాశము చేయుటకు భూమిమీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును (ఆదికాండము 6:17)

“భూమిపై కదులుతున్న ప్రతి ప్రాణి తొలగించబడును.”

ఎందుకనగా ఇంకను ఏడు దినములకు నేను నలుబది పగళ్లును నలుబది రాత్రులును భూమిమీద వర్షము కురిపించి, నేను చేసిన సమస్త జీవరాసులను భూమిమీద ఉండకుండ తుడిచివేయుదునని నోవహుతో చెప్పెను. (ఆదికాండము 7:4)

“భూమిపై ఉన్న ప్రతి ప్రాణి చనిపోయింది—పక్షులు, మృగాలు, పురుగులు, జంతువులు అన్నీ చనిపోయాయి. నోవహు మరియు ఆయన కుటుంబం మాత్రమే కాపాడబడ్డారు.”

అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమిమీద ప్రాకు పురుగులేమి భూమిమీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి. పొడి నేలమీదనున్న వాటన్నిటిలోను నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నియు చనిపోయెను. నరులతో కూడ పశువులును పురుగులును ఆకాశ పక్షులును నేలమీదనున్న జీవరాసులన్నియు తుడిచి వేయబడెను. అవి భూమిమీద నుండకుండ తుడిచివేయబడెను. నోవహును అతనితో కూడ ఆ ఓడలో నున్నవియు మాత్రము మిగిలియుండెను. (ఆదికాండము 7:21-23)

మనుషులను చంపడంలో దేవునికి ఈ లోకంలో ఎవరూ పోటీ లేరు. తన మొదటి శిక్షలోనే ఇంత భయంకరమైన ఘాతుకత్వాన్ని చూపించాడు. భూమిపై అందరినీ చంపిన దేవుణ్ణి హిట్లర్, స్టాలిన్, పోల్ పాట్, గెంగిస్ ఖాన్ లాంటి నియంతలతో పోల్చడం కష్టం. కొంతమంది మరణాల సంఖ్యలో ఆయనను మించి ఉండవచ్చు, కానీ శాతం వారీగా (100% మనుషులను చంపడంలో) ఆయనకు సాటి లేరు.

దేవుని కారణాలు:

“మనుషుల చెడు ఆలోచనలు, దుష్ట మనసుల వల్ల నేను వారిని సృష్టించినందుకు పశ్చాత్తాపపడుతున్నాను(సంతాపం).” (ఆదికాండము 6:5-6)

“భూమి అక్రమం, హింసతో నిండిపోయింది.” (ఆదికాండము 6:11)

దేవుడు నోవహుతో చెప్పాడు: “భూమి హింసతో నిండిపోయింది, అందుకే నేనే భూమిని నాశనం చేస్తాను.” (ఆదికాండము 6:13)

మానవుల దుర్మార్గపు స్వభావాల కారణంగా ఆయన ఈ మహా ప్రళయాన్ని నిర్ణయించాడు.

జలప్రళయం తర్వాత:

“దేవుడు ప్రేమతో ఇలా అన్నారు: ఇకపై నేను భూమిని శపించను, ఎందుకంటే మనుషుల హృదయాలు చిన్ననాటి నుండి చెడుగానే ఉన్నాయి.” (ఆదికాండము 8:21)

దేవుడు ఎంతోమందిని చంపినా, మానవుల చెడు స్వభావం మారలేదు. ఆయనకు ఇది బాధ కలిగించింది, మరియు తన తప్పును గ్రహించాడు.

సారాంశం:

లక్షల మందిని చంపినా, యెహోవా మానవుల చెడు స్వభావాన్ని మార్చలేకపోయాడు. ఆయన మొదటి ఘోరమైన శిక్ష అయిన జలప్రళయం, సృష్టిని నాశనం చేయడమే తప్ప ఏమీ సాధించలేదు. మానవుల చెడు హృదయం అలాగే కొనసాగుతూనే ఉంది. దేవునికి దూరదృస్టి లేదు. భవిష్యత్తు ద్రుష్టి అంతకంటే లేదు. కానీ ఆయన దేవుడే. దయచేసి నమ్మండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *